Four children died after sinking in krishna river, Jogulamba Gadwal district. జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు కృష్ణా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణా నదిలో ఈ దుర్ఘటన జరిగింది. చిన్నారుల మృతితో వారిళ్లల్లో తీరని విషాదం నెలకొంది.